Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మొండికేసిన డ్రైవర్లు... మొరాయించిన రైళ్ళు

మొండికేసిన డ్రైవర్లు... మొరాయించిన రైళ్ళు
, మంగళవారం, 21 ఏప్రియల్ 2015 (07:49 IST)
జర్మనీలో రైలు ట్రైనీ డ్రైవర్లు తాము నడిపేది లేదని ఆందోళనకు దిగుతున్నారు. తమ జీతాలను పెంచాలని చాలా కాలంగా చెబుతున్నా పట్టించుకోవడం లేదని వారు వాపోయారు. ధర్నాకు దిగారు. వివరాలిలా ఉన్నాయి. 
 
తమ జీతభత్యాల పెంపునకు ఇప్పటికే పలుమార్లు చెప్పామని, గత తొమ్మిది నెలల్లో తమ జీత భత్యాలు పెంచాలని ధర్నాకు దిగడం ఇది ఏడోసారని వారు తెలియజేశారు. మంగళవారం సాయంత్రం మూడు గంటలనుంచి వారు పూర్తి స్థాయిలో రైళ్లు నడపకుండా ధర్నాకు దిగనున్నారు. 
 
ఇప్పటికే యాజమాన్యాలతో 16 రౌండ్లు చర్చలు జరిపినప్పటికీ ఫలితం లేకపోవడంతో తాము ఈ నిర్ణయానికి వచ్చినట్లు రైలు డ్రైవర్ల సంఘం తెలిపింది.
 

Share this Story:

Follow Webdunia telugu