Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆ నగరాల్లో మహిళలు అర్థరాత్రి కూడా ఒంటరిగా వెళ్ళొచ్చట..!

ఆ నగరాల్లో మహిళలు అర్థరాత్రి కూడా ఒంటరిగా వెళ్ళొచ్చట..!
, బుధవారం, 26 ఆగస్టు 2015 (17:23 IST)
అర్థరాత్రి మహిళ ఒంటరిగా తిరిగినప్పుడే భారత దేశానికి నిజమైన స్వాతంత్ర్యం వచ్చిందని భావించాలని పూజ్య బాపూజీ అన్నారు.కానీ ఇప్పుడు రాత్రి పూట కాదు.. పగలు కూడా మన భారత దేశంలో భద్రత కరువైన నేపథ్యంలో.. కొన్ని నగరాల్లో మాత్రం ఇప్పటికీ మహిళలు అర్థరాత్రి పూట యధేచ్చగా ఒంటరిగా వెళ్ళొచ్చని సర్వేలు తేల్చాయి. మహిళా భద్రతకు ప్రపంచంలోని 12 నగరాలు కట్టుబడి ఉన్నాయని సర్వేలు వెల్లడించాయి. 
 
వీటిలో జపాన్ లోని టోక్యో నగరం అత్యంత భద్రమైన పట్టణంగా పేరొందిందని తాజా సర్వేలు తేల్చాయి. తర్వాత దక్షిణ కొరియాలో సియోల్ పట్టణం మహిళలకు భద్రమైన నగరమని పేర్కొంది. సౌత్ కెనడాలోని టొరెంటో మూడో స్థానంలో నిలిచింది. 
 
దుబాయ్ కూడా భద్రతలో బెస్టని సర్వే వెల్లడించింది. వీటితో పాటు మెల్ బోర్న్, న్యూయార్క్, శాన్ ప్రాన్సిస్కో, జ్యూరిచ్, ఆమ్ స్టర్ డ్యామ్, రేక్జావిక్, హోచిమిన్ సిటీ, క్వీన్స్ టౌన్ పట్టణాలు మహిళల స్వేచ్ఛా జీవనానికి అనువుగా ఉన్నాయని సర్వేలు తేల్చాయి.

Share this Story:

Follow Webdunia telugu