Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

శ్రీలంక నేవీ సిబ్బంది అదుపులో 16 మంది మత్స్యకారులు, 3 బోట్లు స్వాధీనం

శ్రీలంక నేవీ సిబ్బంది అదుపులో 16 మంది మత్స్యకారులు, 3 బోట్లు స్వాధీనం
, మంగళవారం, 1 సెప్టెంబరు 2015 (12:53 IST)
శ్రీలంక నేవీ సిబ్బంది అదుపులో తమిళనాడుకు చెందిన 16 మంది మత్స్యకారులు ఉన్నారు. మంగళవారం లంక ప్రాదేశిక జలాల్లో ప్రవేశించి చేపలు పడుతుండగా వారిని అదుపులోకి తీసుకున్నట్లు శ్రీలంక మత్స్యశాఖకు చెందిన ఉన్నతాధికారులు చెప్పారు. వారితో పాటు 3 బోట్లను కూడా స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. అరెస్టైన మత్స్యకారులు పుదుకొట్టాయి జిల్లాలోని జగదాపట్టినంకు చెందిన వారని అధికారులు వెల్లడించారు.
 
అయితే సెల్వరాజ్ అనే ఓ మత్స్యకారుడు చనిపోయాడని, అతని మృతదేహం బోటులో ఉండగా గుర్తించినట్టు తెలిపారు. జాఫ్నా జిల్లాలోని కంగెన్‌సన్దురైలో మూడు బోట్లు అర్థరాత్రి చేపల వేటలో ఉండగా బోట్లను నేవీ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారని ఫిషెరీస్ డిపార్ట్‌మెంట్ అసిస్టెంట్ డైరక్టర్ రవిచంద్రన్ చెప్పారు. 

Share this Story:

Follow Webdunia telugu