Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తెలంగాణ ప్రజలు ఏపీలో కలవాలనుకునే రోజు వస్తుంది: సోమిరెడ్డి

తెలంగాణ ప్రజలు ఏపీలో కలవాలనుకునే రోజు వస్తుంది: సోమిరెడ్డి
, మంగళవారం, 26 మే 2015 (12:21 IST)
తెలంగాణ ప్రజలు కూడా ఆంధ్రప్రదేశ్‌లో కలవాలనుకునే రోజు రాకనే వస్తుందని టీడీపీ ఎమ్మెల్సీ, సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కొత్త జోస్యం చెప్పారు. రాష్టం విడిపోయిన తర్వాత ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ఆ పరిస్థితి మారే రోజు త్వరలోనే ఉందని చెప్పారు.

రాష్ట్రంలో ఎక్కడా లేనంతగా నెల్లూరు జిల్లాకు పరిశ్రమలు తరలి వస్తున్నాయని సోమిరెడ్డి తెలిపారు. అధికారుల కారణంగా టీడీపీ కార్యకర్తలకు నష్టం జరిగితే ఊరుకోమని హెచ్చరించారు.
 
ఇదిలా ఉంటే.. ఏపీకి ప్రత్యేక హోదా అంశం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. తాజాగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ప్రత్యేక హోదాపై స్పందించారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాపై వెనక్కి వెళ్లే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఈ అంశానికి సంబంధించి ఈ మధ్యే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో కూడా చర్చించామని తెలిపారు. దీనిపై త్వరలోనే ఓ నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

Share this Story:

Follow Webdunia telugu