Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అమెరికా కోర్టులో న్యాయమూర్తిగా చెన్నై నారీమణి!

అమెరికా కోర్టులో న్యాయమూర్తిగా చెన్నై నారీమణి!
, గురువారం, 16 ఏప్రియల్ 2015 (15:30 IST)
అమెరికా కోర్టులో మరో భారతీయ మహిళ న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఈమె తమిళనాడు రాష్ట్రం చెన్నైకి చెందిన రాజరాజేశ్వరి న్యూయార్క్‌లోని క్రిమినల్ కోర్టు జడ్జిగా నామినేట్ అయ్యారు. అమెరికాలో న్యాయమూర్తిగా ఎంపికైన తొలి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించారు. 
 
తన 16 ఏళ్ల ప్రాయంలో అమెరికా వెళ్ళిన ఆమె, న్యాయవిద్య అనంతరం 16 సంవత్సరాలుగా రిచమండ్ కౌంటీ డిస్ట్రిక్ట్ అసిస్టెంట్ అటార్నీగా విధులు నిర్వహిస్తున్నారు. న్యాయశాస్త్రంతో పాటు భరతనాట్యం, కూచిపూడి నృత్యాలలో ప్రావీణ్యం ఉన్న ఆమె, తన తల్లి పద్మారామనాథన్ పేరిట ప్రారంభించిన డాన్స్ అకాడమీ తరపున అప్పుడప్పుడూ ప్రదర్శనలు కూడా ఇస్తూ మంచి పేరు కూడా సంపాదించుకున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu