Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆ వంద మంది ఉగ్రమూకలను వెతికిపట్టుకోండి.. లేకుంటే విధ్వంసమే: పాక్

సర్జికల్ స్ట్రైక్స్‌కి తర్వాత ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపేందుకు పాక్ సర్కారు సన్నాహాలు చేసింది. పాకిస్థాన్‌లోని రావల్పిండి పోలీసులకు ఇప్పటికే పాక్ సర్కారు నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. భవాల్పూర్, ఫైసలాబాద్

ఆ వంద మంది ఉగ్రమూకలను వెతికిపట్టుకోండి.. లేకుంటే విధ్వంసమే: పాక్
, సోమవారం, 10 అక్టోబరు 2016 (18:21 IST)
సర్జికల్ స్ట్రైక్స్‌కి తర్వాత ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపేందుకు పాక్ సర్కారు సన్నాహాలు చేసింది. పాకిస్థాన్‌లోని రావల్పిండి పోలీసులకు ఇప్పటికే పాక్ సర్కారు నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. భవాల్పూర్, ఫైసలాబాద్, ముల్తాన్, రావల్పిండి, డేరా ఘజిఖాన్ డివిజన్లకు చెందిన 102 మంది ఉగ్రవాదుల ఆచూకీ  కనిపించకుండా పోయింది. వీరిని వెతికి పట్టుకోవాలని రావల్పిండి పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. పాక్‌లో అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకముందే వారిని అరెస్ట్ చేసేందుకు పాక్ పోలీసులు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. 
 
ఒకవేళ వారిని అదుపులోకి  తీసుకోకపోతే, 2013లో రాజాబజార్‌లో జరిగిన విధ్వంసం లాంటి ఘటన పునరావృతమయ్యే అవకాశం ఉందని పాక్ సర్కారు హెచ్చరించింది. ఆ ఘటనలో 13 మంది పౌరులు దుర్మరణం పాలైన సంగతిని పాక్ సర్కారు గుర్తు చేసింది. మొహరం సందర్భంగా వారు దాడులకు పాల్పడే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించడంతో వారిని అదుపులోకి తీసుకునే దిశగా పోలీసులు సర్వ ప్రయత్నాలు చేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ట్రంప్ తాజ్ మహల్ మూతపడింది... కూతురిపై అశ్లీల వ్యాఖ్యలు.. ఆ వీడియోనే కొంపముంచిందా?