Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

న్యూఢిల్లీలో బరాక్ ఒబామా.. నరేంద్ర మోడీ ఆత్మీయ ఆలింగనం!

న్యూఢిల్లీలో బరాక్ ఒబామా.. నరేంద్ర మోడీ ఆత్మీయ ఆలింగనం!
, ఆదివారం, 25 జనవరి 2015 (11:15 IST)
అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా దంపతులు న్యూఢిల్లీకి చేరుకున్నారు. ఢిల్లీలోని పాలం విమానాశ్రయానికి ఒబామా ప్రయాణించిన విమానం ఎయిర్‌ఫోర్స్ వన్ చేరుకోగానే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎయిర్‌పోర్టుకు చేరుకుని ఘన స్వాగతం పలికారు. ఆ తర్వాత ఆత్మీయ ఆలినంగనం చేసుకున్నారు. 
 
వాస్తవానికి అనుకున్న సమయం కంటే సుమారు అరగంట ముందుగా ఒబామా ప్రయాణించిన విమానం న్యూఢిల్లీకి చేరుకుంది. ఒబామా దంపతులు ఉపయోగించే 'బీస్ట్' వాహనాన్ని నేరుగా విమానం వద్దకు తీసుకురావడంతో దాని సమీపంలోనే స్వాగత కార్యక్రమాలు పూర్తయ్యాయి. 
 
ముందుగా ఒబామాకు షేక్ హ్యాండ్ ఇచ్చిన నరేంద్ర మోడీ, ఆ తర్వాత ఆయనను ఆలింగనం చేసుకున్నారు. ఆ తర్వాత మిషెల్ ఒబామా కూడా మోడీతో చేతులు కలిపారు. అనంతరం ఒబామా, మోడీ, మిషెల్ ముగ్గురూ చేతులు ఊపుతూ ఫొటోలకు పోజులిచ్చారు. అనంతరం ఒబామా దంపతులు ఐటీసీ మౌర్య హోటల్‌కు చేరుకున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu