Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నవంబర్ 26, 2008.. ముంబై దాడి ముష్కరుడికి పాక్‌లో బెయిల్!

నవంబర్ 26, 2008.. ముంబై దాడి ముష్కరుడికి పాక్‌లో బెయిల్!
, గురువారం, 18 డిశెంబరు 2014 (17:15 IST)
పాక్ తాలిబన్లు పెషావర్‌లో కొనసాగించిన నరమేధంతో ఓ వైపు పాక్ జాతీయులు విలపిస్తుంటే... మరోవైపు ఉగ్రవాద నాయకుడికి పాక్ కోర్టు బెయిల్ మంజూరు చేసి యావత్తు ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. అదీ ముంబై దాడుల ముష్కరుడికి పాక్ కోర్టు బెయిల్ మంజూరు చేయడం గమనార్హం. 
 
నవంబర్ 26, 2008లో లష్కరే తాయిబా ఉగ్రవాదులు ఉన్మాదంతో ముంబయిపై చేసిన దాడుల్లో 166 మంది చనిపోయిన సంగతి తెలిసిందే. ఈ ఉగ్రదాడులకు సూత్రధారి, లష్కరే తాయిబా సీనియర్ కమాండర్ అయిన జకీ-ఉర్-రెహ్మాన్ లక్వీ ప్రస్తుతం పాకిస్థాన్‌లోని రావల్పిండి జైల్లో ఉన్నాడు. ఈ కిరాతకుడికి పాక్‌లోని ఉగ్రవాద వ్యతిరేక న్యాయస్థానం గురువారం బెయిల్ మంజూరు చేసింది. 
 
26/11 ఘటనకు సంబంధించిన కేసును త్వరగా విచారించి, నిందితులకు శిక్ష ఖరారు చేయాలని ఓ వైపు పాక్‌ను ఇండియా కోరుతున్నప్పటికీ.. లక్వీకి బెయిల్ మంజూరు కావడం గమనార్హం. 

Share this Story:

Follow Webdunia telugu