Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పాకిస్థాన్‌లో ఉరిశిక్షల అమలు జోరు: ముషారఫ్ దాడి కేసు ముద్దాయిలకు!

పాకిస్థాన్‌లో ఉరిశిక్షల అమలు జోరు: ముషారఫ్ దాడి కేసు ముద్దాయిలకు!
, సోమవారం, 22 డిశెంబరు 2014 (14:01 IST)
పెషావర్ సైనిక పాఠశాలలో తాలిబన్ ఉగ్రవాదులు జరిపిన మారణహోమం తర్వాత పాకిస్థాన్ కళ్ళు తెరిచింది. ఇపుడు ఉగ్రవాదుల ఏరివేత లక్ష్యంగా ఆ దేశ ప్రభుత్వంతోపాటు.. సైనిక బలగాలు ముందుకు కదులుతున్నాయి. 
 
ముఖ్యంగా, ఉగ్రవాద చర్యలకు పాల్పడి మరణదండన శిక్షతో జైళ్లలో ఉన్న వారికి శిక్షలను అమలు చేస్తోంది. పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్‌పై హత్యాయత్నం చేసిన గులాం సర్వార్, రషీద్ తిపు, జుబైర్ అహ్మద్, అఖ్లాక్ అహ్మద్ లను ఉరితీసినట్టు ఫైసలాబాద్ జైలు అధికారులు తెలిపారు. 
 
ఇదే జైలులో శుక్ర, శనివారాల్లో నలుగురిని ఉరితీసిన సంగతి తెలిసిందే. దీంతో ఇప్పటి వరకు మొత్తం ఎనిమిది మందికి ఉరిశిక్షలను అమలు చేశారు. మరణశిక్షను ఎదుర్కొంటున్న ఉగ్రవాదులకు సాధ్యమైనంత త్వరలో శిక్షను అమలు చేయాలని భావిస్తున్నట్టు పాక్ అధికారులు తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu