Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

హనీమూన్ కపుల్స్ సన్నిహితంగా ఉండగా వీడియో తీసి డబ్బుల కోసం బెదిరించి జైలుపాలు?

హనీమూన్ కపుల్స్ సన్నిహితంగా ఉండగా వీడియో తీసి డబ్బుల కోసం బెదిరించి జైలుపాలు?
, బుధవారం, 1 జూన్ 2016 (14:38 IST)
కొత్తగా పెళ్లైన దంపతులు హనీమూన్‌ కోసం దుబాయికి వెళ్లారు. ఈ దంపతులను పాకిస్థాన్‌కు చెందిన వ్యక్తి (28) రహస్యంగా వీడియో తీసి బ్లాక్‌మెయిల్‌ చేసిన ఘటన దుబాయిలో కలకలం రేపింది. నాలుగు రోజుల హనీమూన్‌ కోసం వెళ్లిన భారత జంట దుబాయిలో కారులో నగరమంతా షికార్లు కొట్టారు. వారు సన్నిహితంగా ఉన్న సమయంలో కారు డ్రైవర్‌ ఫోన్‌లో రహస్యంగా వీడియో తీశాడు. అనంతరం ఆ జంట కారు దిగి వెళ్లిపోయిన తర్వాత ఆ డ్రైవర్‌ వాట్సాప్‌ ద్వారా వీడియోను ఆ జంటలోని పురుషునికి పంపి 2000 దిర్హామ్‌లు (సుమారు రూ.36,500) ఇవ్వాలని డిమాండ్‌ చేశాడు. 
 
లేదంటే అతని భార్యనైనా ఇవ్వమని బెదిరించాడు. తను అడిగింది ఇవ్వకపోతే తీసిన వీడియోను సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేస్తానని బెదిరించాడు. కాగా భారతీయ వ్యక్తి మరో స్నేహితుడి సహాయంతో పథకం వేశాడు. పథకం ప్రకారం అతడికి డబ్బు ఇస్తాం రమ్మని హోటల్‌కు పిలిచారు. మరోపక్క పోలీసులను ఆశ్రయించి జరిగింది వివరించారు. డబ్బు ఆశతో వచ్చిన పాకిస్థాన్‌ వ్యక్తిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. విచారణ జరిపిన కోర్టు అతడిని దోషిగా నిర్ధారించింది. టెక్నాలజీ సహాయంతో దంపతుల ప్రైవసీకి భంగం కలిగించాడని.. బ్లాక్‌మెయిల్‌ చేశాడనే నేరాలు కోర్టులో తేటతెల్లమైంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భారత్‌లో 1,83,54,700 మంది బానిసలు.. సెక్స్ వర్కర్లు, కూలీలుగా.. తక్కువ జీతానికి?