Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం.. పాక్ అడ్డు!

భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం.. పాక్ అడ్డు!
, బుధవారం, 28 జనవరి 2015 (13:11 IST)
ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం కల్పించేందుకు పాకిస్థాన్ అడ్డు పడుతోంది. ఐరాసలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం కల్పించేందుకు అమెరికా మద్దతిస్తుందంటూ అధ్యక్షుడు బరాక్ ఒబామా హామీ ఇవ్వడంపై పాకిస్థాన్ వ్యతిరేకత వ్యక్తం చేస్తోంది. 
 
పాక్ జాతీయ భద్రత, విదేశాంగ వ్యవహారాల సలహాదారు సర్తాజ్ అజీజ్ మాట్లాడుతూ, ఐరాస భద్రతా మండలిలో భారత్‌కు అమెరికా మద్దతు ఇవ్వడమంటే ఆగ్నేయాసియాలో శాంతి, స్థిరత్వానికి పాతర వేయడమేనని వ్యాఖ్యానించారు. 
 
అంతేగాక, న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్‌లో భారత్‌కు సభ్యత్వం ఇవ్వడాన్ని కూడా తమదేశం వ్యతిరేకిస్తోందని తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu