Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పెషావర్ ఘటన గుండెను పిండేసింది: అల్ ఖైదా పెషావర్ బ్రాంచ్

పెషావర్ ఘటన గుండెను పిండేసింది: అల్ ఖైదా పెషావర్ బ్రాంచ్
, సోమవారం, 22 డిశెంబరు 2014 (11:08 IST)
పెషావర్ ఘటను గుండెను పిండేసిందని పాకిస్థాన్‌లో అల్ ఖైదా పెషావర్ విభాగం వెల్లడించింది. పాకిస్థాన్‌లో తెహ్రీక్-ఏ-
తాలిబన్ గ్రూపు పెషావర్ సైనిక పాఠశాలపై దాడిచేసి చిన్నారులను బలిదీసుకోవడాన్ని ఉగ్రవాద సంస్థలు సైతం తప్పుబడుతున్నాయి. 
 
అల్ ఖైదా దక్షిణాసియా విభాగం ప్రతినిధి ఒసామా మెహమూద్ తాలిబన్ల దుశ్చర్యపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన నాలుగు పేజీల ఈ-మెయిల్ ప్రకటనను మీడియాకు పంపారు. బాధతో గుండె బద్దలైందని పేర్కొన్నారు. 
 
మిలిటెంట్లు భద్రతా బలగాలను మాత్రమే లక్ష్యంగా చేసుకోవాలని సూచించారు. సోదర తాలిబన్ల కిరాతకాన్ని ఆఫ్ఘన్ తాలిబన్ గ్రూపు కూడా ఖండించారు. అమాయక బాలలను చంపడం ఇస్లాంకు వ్యతిరేకమన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu