పాకిస్థాన్కు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా క్రిస్మస్ గిప్ట్గా పెద్ద మొత్తంలో నజరానాను ఇవ్వనున్నారు. ఆఫ్ఘనిస్థాన్లో అమెరికా చేపట్టిన సైనికచర్యకు సహకరించినందుకుగాను రూ. 6వేల కోట్ల (1 బిలియన్ డాలర్లు) బహుమతిని ఒబామాప్రకటించారు.
ఈ మేరకు నిధులు మంజూరు చేస్తూ అమెరికా వార్షిక డిఫెన్స్ పాలసీ బిల్లుపై అధ్యక్షుడు బరాక్ ఒబామా సంతకం చేశారు. అయితే ఈ నిధుల్ని పాక్కు అందజేసే విషయంలో కొన్ని షరతులు విధించింది. పాక్ కేంద్రంగా విధ్వంస కార్యకలాపాలకు పాల్పడుతున్న ఉగ్రవాద సంస్థలు, ప్రత్యేకించి హక్కానీ నెట్వర్క్పై తీసుకునే చర్యలను బట్టి ఈ నిధులు విడుదల చేస్తుందట.
ఈ రూ. 6 కోట్ల మొత్తాన్ని ప్రతి ఆరు నెలలకొకసారి 2017, డిసెంబర్ వరకు సమర్పించే నివేదికల ఆధారంగా పాక్కు విడుదల చేయనుంది. అంతేకాకుండా ఈ బహుమతిలో కొంత మొత్తాన్ని అమెరికానే ఉంచుకుంటుంది. ఎప్పుడైతే ఉత్తర వజీరిస్ధాన్ నుంచి ఉగ్రవాదులను పూర్తిగా తరిమేస్తుందో అప్పుడే ఈ మొత్తాన్ని అందజేస్తుంది.