Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బ్లాక్ మనీ తీవ్రవాదుల చేతుల్లోకి వెళ్తోంది: స్వరాజ్ పాల్

బ్లాక్ మనీ తీవ్రవాదుల చేతుల్లోకి వెళ్తోంది: స్వరాజ్ పాల్
, సోమవారం, 24 నవంబరు 2014 (13:50 IST)
నల్లధనం వల్ల కలిగే నష్టాలను చాలా దేశాలు ఇప్పుడు గుర్తించాయని, నల్లధనం తీవ్రవాదుల చేతుల్లోకి వెళ్తున్నాయని భారతీయ పారిశ్రామికవేత్త, కపారో గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అధిపతి లార్డ్ స్వరాజ్ పాల్ ఆందోళన వ్యక్తం చేశారు. 
 
నల్లధనం తీవ్రవాదుల చేతుల్లోకి వెళుతోందని, తద్వారా కలిగే విపరిణామాలపై కళ్లు తెరిచాయని స్వరాజ్ పాల్ చెప్పారు. ఇకనైనా నల్లధనంపై పోరును ఉధృతం చేయాలని ఆయన అభిప్రాయపడ్డారు. నల్లధనం ఏ ఒక్క దేశానికో సంబంధించిన సమస్య కాదన్నారు. బ్లాక్మనీ నిర్మూలనకు అన్నిదేశాలు కలిసిరావాలని కోరారు.
 
విదేశాల్లో భారతీయులు అక్రమంగా దాచిన సొమ్మును నరేంద్ర మోడీ ప్రభుత్వం వెనక్కు తీసుకొచ్చేందుకు చేపడుతున్న చర్యలపై స్వరాజ్ పాల్ పైవిధంగా స్పందించారు.

Share this Story:

Follow Webdunia telugu