Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తీవ్రవాదుల చేతుల్లోకి బ్లాక్‌మని : స్వరాజ్ పాల్

తీవ్రవాదుల చేతుల్లోకి బ్లాక్‌మని : స్వరాజ్ పాల్
, ఆదివారం, 23 నవంబరు 2014 (16:11 IST)
బ్లాక్‌మని తీవ్రవాదుల చేతుల్లోకి వెళుతోందని ప్రవాస భారతీయ పారిశ్రామికవేత్త, కపారో గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అధిపతి లార్డ్ స్వరాజ్ పాల్ ఆందోళన వ్యక్తం చేశారు. బ్లాక్‌మని వల్ల కలిగే నష్టాలను చాలా దేశాలు ఇప్పుడు గుర్తించాయని అన్నారు. బ్లాక్‌మని తీవ్రవాదుల చేతుల్లోకి వెళ్లడం వలన కలిగే విపరిణామాలపై కళ్లు తెరిచాయని పేర్కొన్నారు.
 
ఇకనైనా బ్లాక్‌మనిపై పోరును ఉధృతం చేయాలని ఆయన అభిప్రాయపడ్డారు. విదేశాల్లో భారతీయులు అక్రమంగా దాచిన సొమ్మును నరేంద్ర మోదీ ప్రభుత్వం వెనక్కు తీసుకొచ్చేందుకు చేపడుతున్న చర్యలపై స్వరాజ్ పాల్ స్పందించారు.

Share this Story:

Follow Webdunia telugu