Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మృత్యుసాగరంగా మధ్యదరా సముద్రతీరం... 74 మృతదేహాలు

మధ్యదరా సముద్ర తీర ప్రాంతం మృత్యుసాగరాన్ని తలపిస్తోంది. ఈ తీరానికి ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా 70కిపైగా మృతదేహాలు కొట్టుకొచ్చాయి. ఇంకా మరికొన్ని మృతదేహాలు సముద్రపు నీటిపై తేలాడున్నాయి.

మృత్యుసాగరంగా మధ్యదరా సముద్రతీరం... 74 మృతదేహాలు
, బుధవారం, 22 ఫిబ్రవరి 2017 (16:57 IST)
మధ్యదరా సముద్ర తీర ప్రాంతం మృత్యుసాగరాన్ని తలపిస్తోంది. ఈ తీరానికి ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా 70కిపైగా మృతదేహాలు కొట్టుకొచ్చాయి. ఇంకా మరికొన్ని మృతదేహాలు సముద్రపు నీటిపై తేలాడున్నాయి. 
 
ఇటీవల ఆఫ్రికా నుంచి యూరప్ వెళ్లేందుకు 120 మంది ప్రయాణికులతో కూడిన ఓ పడవ మధ్యదరా సముద్రంలో మునిగిపోయింది. ఈ ఘటనలో ఏ ఒక్కరు కూడా ప్రాణాలతో బయటపడలేదు. ఈ ప్రమాదంలో చనిపోయినవారి మృతదేహాలు తీరానికి కొట్టుకువచ్చాయి.
 
ఫలితంగా మధ్యదరా సముద్రం మ‌రోసారి మృత్యుసాగ‌రంలా కనపిస్తోంది. సముద్ర తీరానికి ఏకంగా 74 మృత దేహాలు కొట్టుకొచ్చాయి. దీంతో సాగ‌ర తీరం అంతా మృత‌దేహాల గుట్ట‌లా క‌నిపించింది. సిరియా, లిబియాలోని శ‌ర‌ణార్థులు స‌ముద్ర మార్గం ద్వారా ఇత‌ర దేశాల‌కు వెళుతూ ప్ర‌మాదాల‌కు గుర‌వుతున్న విష‌యం తెలిసిందే. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కాగుతున్న నూనెలో చిన్నారుల చేతులు పెట్టించాడు... ఎందుకో తెలుసా?