Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బుల్లెట్ రైలులో వ్యక్తి ఆత్మహత్య.. మరో మహిళ మృతి... స్ఫృహకోల్పోయిన ప్రయాణీకులు

బుల్లెట్ రైలులో వ్యక్తి ఆత్మహత్య.. మరో మహిళ మృతి... స్ఫృహకోల్పోయిన ప్రయాణీకులు
, మంగళవారం, 30 జూన్ 2015 (15:32 IST)
జపాన్‌లో అత్యంత వేగంగా పరుగులు తీసే బుల్లెట్ రైలులో ఘోర సంఘటన సంభవించింది. టోక్యో నగరంలో పరుగులుతీస్తున్న బుల్లెట్‌ రైలులో ఉన్న ఒక వ్యక్తి అకస్మాత్తుగా తనతో తెచ్చుకున్న చమురును ఒంటిపై పోసుకుని సిగరెట్ లైటర్‌తో నిప్పు అంటించుకున్నాడు. ఈ ఘటనలో ఆ వ్యక్తితో పాటు మరో మహిళ కూడా ప్రాణాలు కోల్పోయింది. 
 
దీంతో రైలులో మంటలు చెలరేగాయి. రైలు అంతటా పొగలు వ్యాపించడంతో పలువురు ప్రయాణీకులు ఊపిరి ఆడక స్ఫృహ కోల్పోయారు. రైలులో ప్రమాదం జరిగిన విషయాన్ని తెలుసుకున్న వెంటనే రైలును నిలిపివేశారు.

కాగా జపాన్‌లో బుల్లెట్ రైలు పరుగులు తీయడం ప్రారంభమై సుమారు 50 కానుండగా ఇన్నేళ్ల కాలంలో బుల్లెట్ రైలులో ఇటువంటి సంఘటన చోటు చేసుకోవడం ఇదే ప్రధమం. రైల్వే అధికారులు కేసు నమోదు చేసుకుని, రైలులో ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి ఎవరు, అతనితో పాటు మృతి చెందిన మహిళ గురించి విచారణ జరుపుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu