Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

స్మార్ట్ ఫోన్ పచ్చని సంసారంలో చిచ్చు పెట్టింది!

స్మార్ట్ ఫోన్ పచ్చని సంసారంలో చిచ్చు పెట్టింది!
, గురువారం, 31 జులై 2014 (19:27 IST)
ఒకవైపు ఫేస్ బుక్‌, ట్విట్టర్ల పుణ్యంతో విడాకులు పెరిగిపోతున్నాయంటూ తాజా అధ్యయనాల్లో తేలింది. తాజాగా స్మార్ట్ ఫోన్ పచ్చిని సంసారంలో చిచ్చు రేపింది. స్మార్ట్ ఫోన్‌కు బానిసగా మారిందనే కారణంతో తైవాన్‌లో ఓ భర్త విడాకుల కోసం కోర్టుకెక్కాడు. స్మార్ట్ ఫోన్ వ్యసనంగా మారిన తన భార్య ఇంటిని, పిల్లలను నిర్లక్ష్యం చేస్తోందని వాపోయాడు.
 
స్మార్ట్ ఫోన్ కారణంగా తన చిన్నకుమార్తెకి వ్యాక్సిన్ వేయించడం కూడా మర్చిపోయిందని కోర్టు ముందు ఆవేదన వ్యక్తం చేశాడు. ఎంత చెప్పినా ఆమె వైఖరిలో మార్పు లేదని, అందుకే విడాకులు కోరాల్సి వస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. తనను వదిలించుకోవడానికి ఇదో సాకని, తన భర్త చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని అతని భార్య కోర్టుకు తెలిపింది.

Share this Story:

Follow Webdunia telugu