Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కార్గోషిప్ ద్వారా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి జపాన్ విస్కీ.. తాగేందుకా?

కార్గోషిప్ ద్వారా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి జపాన్ విస్కీ.. తాగేందుకా?
, మంగళవారం, 25 ఆగస్టు 2015 (16:44 IST)
మానవ రహిత కార్గోషిప్‌లో అంతర్జాతీయ అంతరిక్షకేంద్రానికి జపాన్ విస్కీ చేరుకుంది. ఈ విస్కీ వ్యోమగాములు తాగేందుకు కాదని.. అంతరిక్షంలో గురుత్వాకర్షణ శక్తి లేని చోట ఆల్కహాల్‌లో జరిగే మార్పులను అధ్యయనం చేసేందుకు శాస్త్రవేత్తలు దీనిని పంపారు.

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో వీటిని అందజేసిన అనంతరం భూమికి ఆ వ్యోమనౌక బయల్దేరింది. సెప్టెంబరులో ఈ మానవ రహిత కార్గోషిప్ భూమికి చేరుకుంది. ఈ కార్గో షిప్ ద్వారా వ్యోమగాములకు అవసరమయ్యే నీరు, ఆహారం, దుస్తులు, ఇతర నిత్యావసర వస్తువులను, వాటితో పాటు పరిశోధనకు అవసరమైన జపాన్ కంపెనీకి చెందిన విస్కీని కూడా పంపించారు.

Share this Story:

Follow Webdunia telugu