Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తుళ్లూరులో ఏపీ సర్కారు రియల్ ఎస్టేట్ వ్యాపారం: జగన్ ఫైర్

తుళ్లూరులో ఏపీ సర్కారు రియల్ ఎస్టేట్ వ్యాపారం: జగన్ ఫైర్
, శుక్రవారం, 6 మార్చి 2015 (13:59 IST)
రాజధాని నిర్మాణానికి అవసరమైన ప్రభుత్వ భూమి అందుబాటులో ఉన్నా.. సర్కారు రైతుల భూములను సేకరిస్తోందని వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్. జగన్ మోన్ రెడ్డి ఆరోపించారు.

నవ్యాంధ్ర రాజధాని పేరిట తుళ్లూరులో ఏపీ సర్కారు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోందని జగన్ విరుచుకుపడ్డారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో శుక్రవారం ఉదయం పార్టీ ఎమ్మెల్యేలతో ఆయన భేటీ అయ్యారు. భేటీ అనంతరం మీడియా మాట్లాడారు. 
 
ఈ సందర్భంగా, రాజధాని నిర్మాణానికి అవసరమైన మేర ప్రభుత్వ భూమి అందుబాటులో ఉన్నా, సర్కారు రైతుల భూములను సేకరిస్తోందని ఆరోపించారు. రైతుల నుంచి సేకరించిన భూములతో ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోందని ఆయన ధ్వజమెత్తారు. ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తామని ఆయన పేర్కొన్నారు.
 

Share this Story:

Follow Webdunia telugu