Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఐసిస్ ఆత్మాహుతి దాడి.... పేల్చేసుకున్న ముగ్గురు... టర్కీలో 36 మంది మృతి

ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణచివేయాలని టర్కీ అధ్యక్షుడు రెసెప్ టయ్యిప్ ఎర్డోగన్ పిలుపునిచ్చిన నేపధ్యంలో టర్కీలోని అతిపెద్ద నగరమైన ఇస్తాంబుల్‌లోని అటాటర్క్ విమానాశ్రయంలో ఉగ్రవాదులు సూసైడ్ దాడికి తెగబడ్డారు. ఈ ఉగ్రదాడిలో 36 మంది అక్కడికక్కడే మృతి చెందగా

ఐసిస్ ఆత్మాహుతి దాడి.... పేల్చేసుకున్న ముగ్గురు... టర్కీలో 36 మంది మృతి
, బుధవారం, 29 జూన్ 2016 (08:04 IST)
ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణచివేయాలని టర్కీ అధ్యక్షుడు రెసెప్ టయ్యిప్ ఎర్డోగన్ పిలుపునిచ్చిన నేపధ్యంలో టర్కీలోని అతిపెద్ద నగరమైన ఇస్తాంబుల్‌లోని అటాటర్క్ విమానాశ్రయంలో ఉగ్రవాదులు సూసైడ్ దాడికి తెగబడ్డారు. ఈ ఉగ్రదాడిలో 36 మంది అక్కడికక్కడే మృతి చెందగా 150 మంది తీవ్రంగా గాయపడినట్లు సమాచారం అందుతోంది. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు చెపుతున్నారు. ఈ ఘటన మంగళవారం రాత్రి 10 గంటలకు జరిగినట్లు తెలుస్తోంది.
 
తొలుత ఉగ్రవాదులు విమానాశ్రయంలోకి చొరబడి గార్డులను కాల్చి చంపుతూ లోనికి వెళ్లిపోయారు. ఆ తర్వాత ప్రయాణికులు కూర్చున్న ప్రాంతానికి చేరుకుని ముగ్గురు ఒకరి తర్వాత ఒకరు పేల్చేసుకున్నారు. ఈ ఆత్మాహతు దాడికి భీతావహులైన ప్రయాణికులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని తలోదిక్కు పరుగులు తీశారు. కాగా ఈ దాడికి ఏ ఉగ్రవాద సంస్థ తమకు సంబంధం ఉన్నట్లు ప్రకటించకపోయినప్పటికీ ఐసిస్ హస్తం ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

స‌న్ రైజ్ సిటీగా విశాఖ‌... కోల్‌క‌తా పోర్టుకు మించి...