Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భారత్‌లో దాడులు జరిగే అవకాశముంది... ఇజ్రాయెల్ పౌరులకు హెచ్చరిక జారీ

కొత్త సంవత్సరం వేళ భారత్‌లో దాడులు జరుపవచ్చని ఇజ్రాయెల్ యాంటీ టెర్రరిజమ్ డైరెక్టరేట్ హెచ్చరించింది. అందువల్ల ఆ దేశంలో ఉన్న తమ పౌరులు జాగ్రత్తగా ఉండాలని ఆ దేశ విదేశాంగ శాఖ హెచ్చరించింది.

భారత్‌లో దాడులు జరిగే అవకాశముంది... ఇజ్రాయెల్ పౌరులకు హెచ్చరిక జారీ
, శనివారం, 31 డిశెంబరు 2016 (10:33 IST)
కొత్త సంవత్సరం వేళ భారత్‌లో దాడులు జరుపవచ్చని ఇజ్రాయెల్ యాంటీ టెర్రరిజమ్ డైరెక్టరేట్ హెచ్చరించింది. అందువల్ల ఆ దేశంలో ఉన్న తమ పౌరులు జాగ్రత్తగా ఉండాలని ఆ దేశ విదేశాంగ శాఖ హెచ్చరించింది. 
 
భారత్‌లోని ఈశాన్య, పశ్చిమ ప్రాంతాల్లోని పర్యాటక స్థలాలు లక్ష్యంగా తీవ్రవాద దాడులు జరగవచ్చని కౌంటర్ టెర్రరిజమ్ బ్యూరో పక్షాన ఇజ్రెయెల్ ప్రధానమంత్రి కార్యాలయం హెచ్చరించింది. ప్రత్యేకంగా బీచ్‌లు, క్లబ్ పార్టీల్లో జరిగే కొత్త సంవత్సర వేడుకలు లక్ష్యంగా దాడులు జరగవచ్చని ఆ దేశం పేర్కొంది. ఇజ్రాయెల్ పౌరులు కొత్తసంవత్సర పార్టీల్లో పాల్గొనవద్దని కోరింది. దేశంలో జనసమ్మర్ధంగా ఉండే మార్కెట్లు, పండగలు, షాపింగ్ ప్రాంతాల్లో తిరగవద్దని సూచించింది.
 
హాలీడే స్పాట్‌లుగా పేరొందిన గోవా, పూణే, ముంబై, కొచ్చిన్ నగరాల్లో ముప్పు ఎక్కువగా ఉందని ఆ ప్రకటనలో పేర్కొంది. ఇజ్రాయెల్ దేశం చేసిన హెచ్చరికను న్యూఢిల్లీలోని ఆ దేశ రాయబార కార్యాలయం నిర్ధారించింది. ఇజ్రాయెల్‌కు చెందిన 20 వేల మంది పౌరులు ప్రతిఏటా భారత్‌ను సందర్శిస్తుంటారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రేమించలేదని యువతిపై కత్తితో దాడి చేశాడు.. ఆపై కుడికాలిపై పొడుచుకున్నాడు..