Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

క్రిస్టియన్‌లపై ఐఎస్ కన్ను... పరుగులుతీస్తున్న మహిళలు..!

క్రిస్టియన్‌లపై ఐఎస్ కన్ను... పరుగులుతీస్తున్న మహిళలు..!
, శనివారం, 28 ఫిబ్రవరి 2015 (12:53 IST)
ప్రపంచ వ్యాప్తంగా అనునిత్యం దారుణాలకు, మారణహోమాలకు నిలయంగా మారిన ఐఎస్ఐఎస్ తీవ్రవాదులు మరో సారి రెచ్చిపోయారు. వారు సిరియాలో క్రిస్టియన్‌లపై కన్నేశారు. ఇటీవల 220 మంది క్రిస్టియన్లను వారు అపహరించారు. తీవ్రవాదులు క్రిస్టియన్లను అపహరిస్తున్న నేపథ్యంలో సిరియాలో వేలాదిమంది మహిళలు తమ ఇళ్లు, గ్రామాలు వదిలి పారిపోతున్నారు. 
 
తాజాగా అక్కడి గ్రామాలలోని 220 అస్సిరియన్ సిటిజన్లను ఐసీఎస్ తీవ్రవాదులు అపహరించారని సిరియా ఆబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ అనే సంస్థ తెలిపింది. వారిలో ఎక్కువ మంది మహిళలు, పిల్లలు ఉన్నట్టు తెలిపింది. హాసాకే ప్రావిన్స్ నుండి ఎత్తుకెళ్లారు. వారిన విడుదల కోసం పలువురు ప్రయత్నాలు చేస్తున్నారు. 220 మంది క్రిస్టియన్ల అపహరణ పైన అమెరికా తీవ్రంగా స్పందించింది. వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేసింది.

Share this Story:

Follow Webdunia telugu