ఐసిస్ మరో ఘాతుకం... లైంగిక కోర్కె తీర్చలేదని 19 మంది బాలికల సజీవ దహనం
ఐఎస్ఐస్ ఉగ్రవాద సంస్థ మరో దారుణానికి పాల్పడింది. తమ లైంగిక కోర్కెలు తీర్చేందుకు నిరాకరించిన 19 మంది బాలికలను అత్యంత దారుణంగా నడిరోడ్డుపై అందరూ చూస్తుండగా నిప్పుపెట్టి కాల్చి చంపింది. ఈ దారుణ ఘటన ఇరాక్ దేశంలోని మోసూల్ పట్టణంలో చోటుచేసుకుంది.
ఐఎస్ఐస్ ఉగ్రవాద సంస్థ మరో దారుణానికి పాల్పడింది. తమ లైంగిక కోర్కెలు తీర్చేందుకు నిరాకరించిన 19 మంది బాలికలను అత్యంత దారుణంగా నడిరోడ్డుపై అందరూ చూస్తుండగా నిప్పుపెట్టి కాల్చి చంపింది. ఈ దారుణ ఘటన ఇరాక్ దేశంలోని మోసూల్ పట్టణంలో చోటుచేసుకుంది.
సెక్స్ బానిసలుగా వేలం వేసే క్రమంలో ఆ బాలికలను ఉగ్రవాదులు అక్కడికి తీసుకువచ్చారు. ఐతే వారిలో 19 మంది బాలికలు సెక్స్ కోర్కెలు తీర్చేందుకు అంగీకరించాలని హుకుం జారీ చేశారు. ఐతే ఆ బాలికలు అందుకు అంగీకరించలేదు. దీనితో వారినందరినీ ఓ ఇనుప బోనులో బంధించి సజీవ దహనం చేశారు. నడిరోడ్డుపైన ఇంత దారుణం జరుగుతున్నా ఎవరూ అడ్డుకునేందుకు ముందుకు రాలేదు. అగ్నికి ఆహుతవుతూ ఆ బాలికలు పెట్టిన హాహాకారాలు మిన్నంటాయనీ, అక్కడి వాతావరణం భీతావహంగా మారిపోయింది ఓ వార్తా పత్రిక వెల్లడించింది.