Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

లిబియాలో రెచ్చిపోయిన ఐసిస్... 30 హతం

లిబియాలో రెచ్చిపోయిన ఐసిస్... 30 హతం
, సోమవారం, 20 ఏప్రియల్ 2015 (09:54 IST)
అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఐసిస్ ఏదోక ప్రాంతంలో అరాచకం సృష్టిస్తూనే ఉంది. తన రక్తదాహాం ఇంకా తీరనిదిగానే మిగిలిపోతోంది. తాజాగా లిబియాలో మరో 30 మంది కాల్చి, తలలు నరికి చంపారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. 
 
30 మంది ఇథియోపియా క్రైస్తవులను నిర్బంధంలోకి తీసుకున్న ఐసిస్ వారిని లిబియాలో హతమార్చింది. ఆదివారం ఆ వీడియోను ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాద సంస్థ విడుదల చేసింది. దాదాపు 29 నిమిషాల నిడివిగల ఈ వీడియోలో కాషాయ దుస్తులు ధరించిన బందీలను రెండు గ్రూపులుగా చేశారు. 
 
వారిలో 12 మందిని బీచ్‌లో  తల నరికి చంపారు. మిగిలిన 17 మందికి పైగా ఉన్న వేరొక బృందాన్ని గుర్తు తెలియని ఎడారి ప్రాంతంలో మోకాలిపై కూర్చోబెట్టి తలపై కాల్చి చంపారు. ఇథియోపియాలో క్రైస్తవులు మతం మార్చుకొని ఇస్లాంలోకి చేరకపోతే ఇదేగతి పడుతుందని వీడియోలో హెచ్చరించారు. 

Share this Story:

Follow Webdunia telugu