Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రంజాన్ వేడుకల్లో విషాదం.. ఇరాక్‌లో 45 మంది, ఘనాలో 19 మంది మృతి

రంజాన్ వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాదులు ఇరాక్‌లో మరోమారు మారణహోమం సృష్టించారు. బాగ్దాద్‌ పేలుళ్ల నుంచి ప్రజలు ఇంకా తేరుకోకముందే బలాద్‌లోని ఓ మసీదు వద్ద కారు బాంబు పేల్చారు.

రంజాన్ వేడుకల్లో విషాదం.. ఇరాక్‌లో 45 మంది, ఘనాలో 19 మంది మృతి
, శుక్రవారం, 8 జులై 2016 (08:56 IST)
రంజాన్ వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాదులు ఇరాక్‌లో మరోమారు మారణహోమం సృష్టించారు. బాగ్దాద్‌ పేలుళ్ల నుంచి ప్రజలు ఇంకా తేరుకోకముందే బలాద్‌లోని ఓ మసీదు వద్ద కారు బాంబు పేల్చారు. ఈ ఘటనలో 35 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 50 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రార్థనల తర్వాత మసీదు నుంచి జనం వస్తున్న సమయంలో కారులో ఉన్న ఉగ్రవాది తనను తాను పేల్చేసుకున్నాడు.
 
అలాగే, ఘనాలో రోజా విరమణ సందర్భంగా ఏర్పాటుచేసిన వేడుకల్లో జరిగిన తొక్కిసలాటలో 19 మంది మరణించారు. కుమసి నగరంలో బుధవారం రాత్రి వేడుకలు జరుగుతుండగా ఒక్కసారిగా కరెంటు పోయింది. భారీగా గుమిగూడిన జనం ఒక్కసారిగా కదలడంతో తొక్కిసలాట చోటుచేసుకొంది. అలాగే, పాకిస్థాన్‌లో జరిగిన చిన్నపాటి తొక్కిసలాటలో మరోముగ్గురు మృత్యుపాలయ్యారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

స్వాతి హత్య కేసు : వాట్సాప్‌లో హల్‌చల్‌ చేస్తున్న స్వాతి, రామ్‌కుమార్‌‌ల పర్సనల్ ఫోటో