Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఇరాక్‌లో మిలిటెంట్ల చెరలో ఉన్న భారతీయులు క్షేమం: సుష్మా

ఇరాక్‌లో మిలిటెంట్ల చెరలో ఉన్న భారతీయులు క్షేమం: సుష్మా
, శుక్రవారం, 25 జులై 2014 (13:15 IST)
ఇరాక్‌లో భారతీయులు క్షేమంగా ఉన్నారని విదేశాంగ శాక మంత్రి సుష్మా స్వరాజ్ లోక్ సభలో తెలిపారు. ఇరాక్‌లోని మోసుల్  నగరంలో ఇస్లామిక్ మిలిటెంట్ల చెరలో బందీగా ఉన్న 41 మంది భారతీయులు క్షేమంగానే ఉన్నారని సుష్మా వెల్లడించారు. రంజాన్ సందర్భంగా బందీల విడుదలకోసం పార్లమెంటు ద్వారా పిలుపునివ్వాలని ఆమె ఎంపీలను కోరారు. 
 
భారతీయుల విడుదలకోసం గల్ఫ్‌దేశాలకు చెందిన విదేశాంగ మంత్రులతో మాట్లాడానని సుష్మా స్వరాజ్ చెప్పారు. అలాగే ఢిల్లీలోని ఆయా దేశాల రాయబారులతో కూడా చర్చలు జరుపుతున్నట్టు తెలిపారు. ఇరాక్ నుంచి మరో 58 మంది నర్సులను భారత్‌కు తిరిగి తీసుకువచ్చినట్టు సుష్మాస్వరాజ్ వెల్లడించారు.
 
ఇకపోతే... ఇరాక్ రాజధాని బాగ్దాద్‌కు సమీపంలో జరిగిన ఆత్మాహుతి దాడిలో సుమారు 60 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఖైదీలు, పోలీసులు, వైద్య సిబ్బంది ఉన్నట్టు సమాచారం. బాగ్దాద్‌కు ఉత్తరాన 25 కిలోమీటర్ల దూరంలోని తాజీ జైలు నుంచి ఖైదీలను బస్సులో మరో ప్రాంతానికి తరలిస్తుండగా గురువారం తెల్లవారుజామున ఈ దాడి జరిగింది.

Share this Story:

Follow Webdunia telugu