Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బంగ్లా ప్రధాని షేక్ హసీనా హత్యకు జమాత్ కుట్ర!

బంగ్లా ప్రధాని షేక్ హసీనా హత్యకు జమాత్ కుట్ర!
, బుధవారం, 29 అక్టోబరు 2014 (13:08 IST)
బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాను హతమార్చేందుకు జమాత్ ఉల్ ముజాహిద్దీన్ (జెయుఎమ్)మిలిటెంట్లు కుట్రపన్నినట్లు భారత్‌కు చెందిన ముగ్గురు ఉగ్రవాద నిరోధక విభాగం అధికారులు బట్టబయలు చేశారు. ఇలాంటి దాడి జరిగితే భారత్‌పై నింద వేయవచ్చునన్న ఉద్దేశంతోనే మిలిటెంట్లు ఇక్కడి నుంచే కుట్ర పన్నినట్టు స్పష్టమవుతోందన్నారు.
 
ఈ కుట్రకు సంబంధించిన వివరాలను బంగ్లా ప్రభుత్వానికి అందిస్తామని ప్రభుత్వ, పోలీసు అధికారులు వివరించారు. ఈ నెల మొదట్లో పశ్చిమ బెంగాల్‌లోని ఓ ఇంట్లో నాటు బాంబులు తయారు చేస్తూండగా ఇద్దరు జెయుఎమ్ సభ్యులు మరణించిన సంఘటనపై విచారణ చేపట్టిన అధికారులకు బంగ్లా ప్రధాని హత్యకు సంబంధించి మిలిటెంట్లు పన్నిన కుట్ర వివరాలు తెలియవచ్చాయి. 
 
మరణించిన ఇద్దరూ బంగ్లాదేశ్ మిలిటెంట్లేనని, భారత్‌ను కేంద్రంగా చేసుకుని దాడులకు పథకం వేశారని హోం మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారి వెల్లడించారు.

Share this Story:

Follow Webdunia telugu