Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మానస సరోవర్ యాత్రకు ఆటంకాలు ఉండవు : జిన్‌పింగ్

మానస సరోవర్ యాత్రకు ఆటంకాలు ఉండవు : జిన్‌పింగ్
, గురువారం, 18 సెప్టెంబరు 2014 (15:48 IST)
భారత్ నుంచి మానస సరోవర్ యాత్రకు వెళ్లే పర్యాటకులకు ఎలాంటి ఆటంకాలు లేకుండా చూస్తామని చైనా అధ్యక్షుడు జిన్‌ పింగ్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి హామీ ఇచ్చారు. ప్రస్తుతం భారత్‌లో పర్యటనకు వచ్చిన ఆయన ఈ మేరకు వాగ్ధానం చేశారు. అంతేకాకుండా, భారత్, చైనాల మధ్య 12 కీలక ఒప్పందాలను చేసుకున్నారు. 
 
గురువారం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో చైనా అధ్యక్షులు జీ జిన్‌పింగ్, ప్రధాని నరేంద్ర మోడీలు దాదాపు 45 నిమిషాలు పలు అంశాల పైన చర్చించారు. అనంతరం వారు ఉమ్మడిగా మీడియా సమావేశం నిర్వహించారు. 
 
ఈ సందర్భంగా భారత్ - చైనాల మధ్య 12 ఒప్పందాల పైన అంగీకారం కుదిరిందని తెలిపారు. ఇందులో సమాచార, షాంఘై - ముంబై నగరాల అభివృద్ధి, రైల్వే, ఆర్థిక, వాణిజ్యం, మానస సరోవర్ రహదారి నిర్మాణం తదితరాల అంశాలు ఉన్నాయి. 

Share this Story:

Follow Webdunia telugu