Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

భార్య శవాన్ని మోస్తూ 10 కిమీ నడక దృశ్యం బహ్రెయిన్ ప్రధానినీ కదిలించింది!

ఇటీవల ఓడిషా రాష్ట్రంలో భార్య శవాన్ని భుజాన వేసుకుని 10 కిలోమీటర్ల మేరకు నడిచిన ఓ బాధితుడి కన్నీటి కథ బహ్రెయిన్ ప్రధానమంత్రిని సైతం కదిలించింది. తక్షణం బహ్రెయిన్‌లోని భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదిం

భార్య శవాన్ని మోస్తూ 10 కిమీ నడక దృశ్యం బహ్రెయిన్ ప్రధానినీ కదిలించింది!
, ఆదివారం, 28 ఆగస్టు 2016 (17:13 IST)
ఇటీవల ఓడిషా రాష్ట్రంలో భార్య శవాన్ని భుజాన వేసుకుని 10 కిలోమీటర్ల మేరకు నడిచిన ఓ బాధితుడి కన్నీటి కథ బహ్రెయిన్ ప్రధానమంత్రిని సైతం కదిలించింది. తక్షణం బహ్రెయిన్‌లోని భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించి.. ఆ బాధితుడి వివరాలను సేకరించారు. 
 
ఒడిశాకు చెందిన దనా మాఝీ భార్య శవాన్ని మోస్తూ పది కిలోమీటర్లు నడక సాగించిన ఘటన దేశాన్నే కాదు ప్రపంచం దృష్టినీ ఆకర్షించిన విషయం తెల్సిందే. ఈ విషాద ఘటనతో అనేక చలించి పోయారు. ఒడిషా ప్రభుత్వాన్ని, ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులపై తీవ్రమైన విమర్శలు చేశారు. 
 
అదేసమయంలో ఈ విషాద ఘటన బహ్రెయిన్ రాజకుటుంబీకులను కదిలించింది. భార్య శవాన్ని భుజాలపై మోసుకెళ్తున్న దృశ్యాన్ని చూసి చలించిపోయిన బహ్రెయిన్ ప్రధాని, రాజ కుటుంబీకుడు షేక్ ఖలీఫా బిన్ సల్మాన్ అల్ ఖలీఫా బాధితుడి కుటుంబ వివరాల కోసం ఆరా తీశారు. 
 
బహ్రెయిన్‌లోని భారత రాయబారి నుంచి సమాచారం కోరినట్టు బహ్రెయిన్ మీడియా వెల్లడించింది. అయితే మాఝీకి ఏ రకమైన సాయం చేయాలనుకుంటున్నారనే విషయాన్ని మాత్రం ప్రధాని కార్యాలయం వెల్లడించలేదు. వ్యక్తి గతంగా మాఝీ కుటుంబానికి ఆర్థిక సాయం అందించాలనుకుంటున్నట్టు సమాచారం. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రత్యక్ష రాజకీయాల వైపు పవన్‌ కళ్యాణ్ అడుగులు