Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తొమ్మిది మందిని కాల్చిన ఉన్మాది.. తానూ ఆత్మహత్య..!

తొమ్మిది మందిని కాల్చిన ఉన్మాది.. తానూ ఆత్మహత్య..!
, శనివారం, 28 ఫిబ్రవరి 2015 (10:14 IST)
అమెరికాలో ఓ వ్యక్తి ఉన్మాదంతో రెచ్చిపోయి విచ్చలవిడిగా కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో తొమ్మిది మంది చనిపోగా, ఆ తర్వాత అతడు తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన అమెరికాలోని మిస్సోరి రాష్ట్రంలో కలకలం సృష్టించింది. వివరాల్లోకి వెళితే.. టైరోన్ పట్టణానికి చెందిన ఒక ఉన్మాది ఈ కాల్పులు జరిపాడు. 
 
ఉన్మాదిగా మారిన ఓ వ్యక్తి వివిధ ప్రాంతాల్లో 9 మందిని కాల్చి చంపి తనను తాను కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కాల్పులు జరిపిన అనుమానితుడి మృతదేహాన్ని గుర్తించామని పోలీసులు తెలిపారు. రోడ్డు పక్కన పార్కింగ్ చేసిన వాహనంలో నిందితుడి మృతదేహాన్ని, నాలుగు ఇళ్లలో బాధితుల మృతదేహాలను కనుగొన్నట్టు పోలీసులు వెల్లడించారు.

Share this Story:

Follow Webdunia telugu