'అల్లాహో అక్బర్' అంటూ గొడ్డలి - కత్తులతో దాడి.. జర్మనీలో ఆప్ఘన్ టీనేజ్ శరణార్థి బీభత్సం!
జర్మనీలోని వుర్జ్బుర్గ్ నగరంలో ఓ ఆఫ్గాన్ యువకుడు బీభత్సం సృష్టించాడు. రైల్లోకి చొరబడి ప్రయాణికులపై గొడ్డలి, కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడినట్లు అధికారులు తెలిపారు.
జర్మనీలోని వుర్జ్బుర్గ్ నగరంలో ఓ ఆఫ్గాన్ యువకుడు బీభత్సం సృష్టించాడు. రైల్లోకి చొరబడి ప్రయాణికులపై గొడ్డలి, కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడినట్లు అధికారులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
త్రెచ్లింజెన్ - వుర్జ్బుర్గ్ మధ్య నడిచే రైలులో బవేరియా సమీపంలో 17 ఏళ్ల ఆఫ్గాన్ యువకుడు చొరబడి ప్రయాణికులపై కత్తి, గొడ్డలితో దాడిచేశాడు. అనంతరం రైలు నుంచి పారిపోయేందుకు ప్రయత్నించాడు. దీంతో అతన్ని పోలీసులు కాల్చి చంపారు. యువకుడి వివరాలను పోలీసులు వెల్లడించలేదు. దాడికి గల కారణాలపై విచారణ చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ఈ దాడికి పాల్పడింది టీనేజ్ ఆఫ్ఘన్ శరణార్థిగా గుర్తించారు.
టీనేజర్ దాడి వల్ల షాక్కు గురైన ప్రయాణికులకు చికిత్సను అందించారు. 17 ఏళ్ల ఆఫ్ఘన్ యువకుడు ఒచ్సెన్ఫోర్ట్ పట్టణంలో నివసిస్తున్నట్లు ఆ రాష్ట్ర మంత్రి తెలిపారు. అల్లాహో అక్బర్ అంటూ యువకుడు దాడికి పాల్పడినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ప్రయాణికులపై దాడి చేసి పారిపోతున్న టీనేజర్ను పోలీసులు వెంటాడి కాల్చి చంపారు.