Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బ్రిటన్‌లో ఎన్.ఆర్.ఐ కుటుంబం అనుమానాస్పదంగా మృతి!

బ్రిటన్‌లో ఎన్.ఆర్.ఐ కుటుంబం అనుమానాస్పదంగా మృతి!
, బుధవారం, 29 అక్టోబరు 2014 (14:10 IST)
బ్రిటన్‌లో ఓ ఎన్.ఆర్.ఐ కుటుంబం అనుమానాస్పదస్థితిలో మృతి చెందింది. ఈ కుటుంబంలోని భార్యాభర్తలతో పాటు వారి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. వీరు సొంతింటిలోనే విగత జీవులుగా పడి ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. మృతి చెందిన వారిని జితేంద్ర లాడ్ (49), భార్య దక్ష (44), పిల్లలు త్రిష (18), నిష(16)లుగా గుర్తించారు. వీరు బ్రిటన్‌, బ్రాండ్ ఫోర్డ్ సిటిలోని క్లేటన్ ప్రాంతంలో నివశిస్తూ వచ్చారు. 
 
కాగా, వీరిలో జితేంద్ర ఉరి వేసుకుని మరణించగా, ఆయన భార్య, ఇద్దరు పిల్లలు అనుమానాస్పద స్థితిలో మరణించారు. వీరు ఆత్మహత్య చేసుకున్నారా?, లేక హత్యకు గురయ్యారా అన్న విషయం విచారణలో తేలుతుందని పోలీసులు తెలిపారు. జితేంద్ర, ఆయన కుటుంబ సభ్యుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు ఇంటిని తమ ఆధీనంలోకి తీసుకుని సీజ్ చేశారు. జితేంద్ర తన భార్యాపిల్లలను హత్య చేసి, ఆ తర్వాత ఉరి వేసుకుని వుండొచ్చనే సందేహాన్ని కూడా వెలిబుచ్చుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu