Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆ ఊర్లో 28 యేళ్ళ తర్వాత పాప పుట్టింది.. మొత్తం జనాభా 85కు పెంచింది.. ఎక్కడ?

ఆ ఊర్లో 28 యేళ్ళ తర్వాత పాప పుట్టింది.. మొత్తం జనాభా 85కు పెంచింది.. ఎక్కడ?
, శుక్రవారం, 5 ఫిబ్రవరి 2016 (12:53 IST)
సాధారణంగా ఒక గూడెంను తీసుకున్నా కనీసం వంద మందికి తగ్గకుండా ప్రజలు ఉంటారు. కానీ, ఆ ఊర్లో మాత్రం ఇటీవల పుట్టిన పసికందుతో కలుపుకుని మొత్తం జనాభా 85కు పెరిగింది. ఇది వినేందుకు ఆశ్చర్యంగానూ.. కాస్తంత విచిత్రంగానూ ఉంది కదూ. కానీ, ఇది నిజం. యూరప్ దేశాల్లో ఒకటైన ఇటలీలోని ఓస్తానా అనే అతి చిన్న పట్టణంలో మొత్తం జనాభా కేవలం 85 మంది మాత్రమే. అదీ మూడు రోజుల క్రితం పట్టిన ఓ పసికందుతో కలుపుకుని. పైగా, ఈ పట్టణంలో గత 28 యేళ్ళ తర్వాత పుట్టిన తొలి బిడ్డ కూడా ఈ పసికందే. దీనికి కారణమేంటో తెలుసుకుందాం.. 
 
ఈ ప్రాంతంలో 1975కు ముందు అక్కడ నెలకొన్న పరిస్థితుల కారణంగా ఈ పట్టణ ప్రజలంతా నగరాలకు వలస వెళ్లిపోయారు. దీనివల్ల జనాభా రోజురోజుకీ తగ్గిపోతూ వస్తోంది. దీంతో 1976 నుంచి 87 వరకు ఒస్తానాలో కేవలం 17 మంది పిల్లలు మాత్రమే పుట్టారు. 1987 తర్వాత 2016 వరకు పట్టణంలో ఒక్క జననం కూడా నమోదు కాలేదు. అయితే, ఇటీవల పుట్టిన పాప ఆ లోటును భర్తీ చేయడమే కాకుండా, జనాభాను 85కు పెంచింది. 

Share this Story:

Follow Webdunia telugu