Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మయన్మార్‌లో కూలిన వైమానికదళ విమానం... ఐదుగురి మృతి

మయన్మార్‌లో కూలిన వైమానికదళ విమానం... ఐదుగురి మృతి
, గురువారం, 11 ఫిబ్రవరి 2016 (10:27 IST)
మయన్మార్‌ రాజధాని నేపిడాలో ఓ చిన్న వైమానిక దళ విమానం కూలిపోయింది. ఈ ఘటనలో విమానంలో ప్రయాణిస్తున్న నలుగురు సిబ్బంది మృతి చెందారు. మొత్తం విమానంలో ఐదుగురు ప్రయాణిస్తున్నారని.. వారిలో నలుగురు మృతిచెందగా.. మరొకరు ప్రాణాలతో బయటపడినట్లు అధికారులు వెల్లడించారు. 
 
రోజువారీ పెట్రోలింగ్‌లో భాగంగా రన్‌వే పై టేకాఫ్ తీసుకున్న వెంటనే విమానంలో మంటలు చెలరేగడంతో పక్కనే ఉన్న ఫీల్డ్స్‌లో కుప్పకూలిపోయిందని తెలిపారు. విమానం కూలగానే మంటలు చెలరేగడంతో స్థానికులు సహాయ చర్యలు చేపట్టారు. అయితే, తీవ్రంగా గాయపడిన వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించినప్పటికీ.. ఆ వ్యక్తి కూడా మరణించినట్టు అధికారులు వెల్లడించారు. 

Share this Story:

Follow Webdunia telugu