Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మెక్సికోలో ఎన్ కౌంటర్... 43 మంది మృతి

మెక్సికోలో ఎన్ కౌంటర్... 43 మంది మృతి
, శనివారం, 23 మే 2015 (10:22 IST)
మెక్సికోలో పోలీసులకు దుండగులకు మధ్యన ఎదురుకాల్పులు జరిగాయి. అనుమానస్పద వాహనాన్ని ఆపేందుకు ప్రయత్నించిన పోలీసులపై దుండగులు కాల్పులు జరిపారు. పోలీసులు జరిపిన ఎదురు కాల్పులలో 43 మంది దుండగులు హతమయ్యారు. వివరాలిలా ఉన్నాయి. 
 
మెక్సికోలోని మిచోకెన్ రాష్ట్రంలో దుండగులు ఫెడరల్ పోలీసులపై దాడి చేశారు. పోలీసులు ఎదురు కాల్పులు జరిపి దుండగులను హతమార్చారు.  ఈ ఘటనకు సంబంధించి అధికారిక నివేదిక రావాల్సివుందని మిచోకెన్ గవర్నర్ సాల్వడర్ చెప్పారు. 
 
కాగా అనుమానాస్పద వాహనాన్ని పోలీసులు ఆపేందుకు ప్రయత్నించగా, సాయుధులు దాడి చేసినట్టు తెలిపారు. ఘటన స్థలానికి ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం వెళ్లింది. పూర్తి వివరాలు తెలియాల్సివుంది.
 

Share this Story:

Follow Webdunia telugu