Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తైవాన్‌లో పెను భూకంపం : రిక్టర్ స్కేలుపై 6.4గా నమోదు

తైవాన్‌లో పెను భూకంపం : రిక్టర్ స్కేలుపై 6.4గా నమోదు
, శనివారం, 6 ఫిబ్రవరి 2016 (11:01 IST)
చైనా సరిహద్దు దేశం తైవాన్‌లో పెను భూకంపం సంభంవించింది. భూకంప తీవ్ర రిక్టర్ స్కేలుపై 6.4గా నమోదైంది. ఈ భూకంపం ఆ దేశంలో పెను విధ్వంసాన్నే సృష్టించింది. భూకంపం ధాటికి తైవాన్‌లోని ఓ 17 అంతస్తుల భారీ భవంతి పేకమేడలా కుప్పకూలింది.

ఈ ప్రమాదంలో ఇప్పటిదాకా ముగ్గురు చనిపోయినట్లు ప్రాథమిక సమాచారం. హుటాహుటిన రంగంలోకి దిగిన సహాయక సిబ్బంది 150 మందికి పైగా ప్రజలను కాపాడారు. 
 
భవనం శిథిలాల కింద ఇంకా చాలామంది చిక్కుకున్నారని సమాచారం. భవనాలు కూలిపోవడంతో చాలామంది ప్రజలు శిథిలాల్లో చిక్కుకుని వుంటారని సహాయక సిబ్బంది చెప్తున్నారు. సహాయక చర్యలు ముమ్మరంగా జరుగుతున్నాయని వెల్లడించారు.

Share this Story:

Follow Webdunia telugu