Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఒబామా వెంట వారు రావట్లేదు... ఎవరు వారు? ఎందుకు?

ఒబామా వెంట వారు రావట్లేదు... ఎవరు వారు? ఎందుకు?
, శుక్రవారం, 23 జనవరి 2015 (08:05 IST)
అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఎదుట విదేశీ పర్యటనకు వారికి మంచి అవకాశం వచ్చింది. కానీ, వారు ఆయన వెంట వారు రావడం లేదు. తాము రాలేమని చెప్పేశారు. ఎవరు వారు? అమెరికా అధ్యక్షుడు అధ్యక్షుడు పిలిస్తే రాలేనంత బిజిగా ఉన్నారా... ? వారే ఒబామా పిల్లలు సాషా, మిలియా.. భారత పర్యటనకు రావడానికి వారికున్న అభ్యంతరం ఏంటి? రండీ తెలుసుకుందాం.
 
సాధారణంగా భారత పర్యటనకు వస్తున్న విదేశీ అధ్యక్షులు, ప్రధాన మంత్రులు తమ కుటుంబంతో సహా వచ్చి పర్యటిస్తారు. అందుకు కారణం ఇక్కడ పర్యటించే ప్రదేశాలు అధికంగా ఉండడమే. అందుకే అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, ఆయన భార్య మిషెల్ ఒబామాల వెంట వారి కుమార్తెలు సాషా(16),మలియా(13) లను తీసుకురావలని అనుకున్నారు. 
 
ఈ మేరకు వారికి చెప్పారు. వారు కూడా ఒప్పుకున్నారు. అయితే మధ్యలోనే కుమార్తెలిద్దరు భారత పర్యటనకు వచ్చేందుకు వీలు కాలేదు. అమెరికా ప్రథమ కుమార్తెలిరువురూ పాఠశాలకు ప్రాధాన్యం ఇస్తారు. స్కూలుకు సెలవులు ఉన్నపుడు మాత్రమే తల్లిదండ్రులతో కలసి విదేశీ ప్రయాణాలకు వెళ్లడానికి ఇష్టపడతారు. కానీ సెలవులు లేకపోవడంతో వారు భారత పర్యటనకు రావడం లేదు. ఈ విషయాన్ని అమెరికా ఉప జాతీయ భద్రతా సలహాదారు బెన్ రోడ్స్ గురువారం విలేకరులకు వెల్లడించారు.

Share this Story:

Follow Webdunia telugu