Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బంగ్లాదేశ్‌లో బాంబు దాడులు.. ఆరుగురు హిందువులకు గాయాలు

బంగ్లాదేశ్‌లో బాంబు దాడులు.. ఆరుగురు హిందువులకు గాయాలు
, శనివారం, 5 డిశెంబరు 2015 (15:42 IST)
బంగ్లాదేశ్‌లోని దినాజ్‌పూర్‌ జిల్లాలో హిందూ వర్గం ప్రజలపై వరుస బాంబు దాడులు జరిగాయి. శనివారం ఉదయం స్థానిక హిందువులంతా ఒకచోట చేరి సంప్రదాయ రష్‌మేళా వేడుకలు నిర్వహిస్తుండగా ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు గాయపడ్డారు. 
 
ఇందులో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. బంగ్లాదేశ్‌లో హిందూవులపై బాంబుదాడులు జరగడం చాలా అరుదు. దీంతో తాజా ఘటనపై అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. దీనికి సంబంధించి ఐదుగురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu