Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

8 మంది పిల్లల్ని హత్య చేసిన కసాయి తల్లి అరెస్టు!

8 మంది పిల్లల్ని హత్య చేసిన కసాయి తల్లి అరెస్టు!
, శనివారం, 20 డిశెంబరు 2014 (16:04 IST)
ఆస్ట్రేలియాలోని కెయిర్న్స్ నగరంలో 8 మంది పిల్లలను కిరాతకంగా కత్తితో పొడిచి హత్య చేసిన తల్లిని పోలీసులు అరెస్టు చేశారు. చనిపోయిన పిల్లలంతా 18 నెలల నుంచి 14 ఏళ్లలోపువారు. కాగా పిల్లల్లో ఏడుగురు ఆమె కన్న బిడ్డలే కాగా, ఎనిమిదో బిడ్డ ఆమెకు సమీప బంధువు. 
 
ఆమె పిల్లలను చంపేందుకు ఆమె ఉపయోగించిన కత్తిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హత్యా చేసిన స్థలం పిల్లలు మృత దేహాలు, టెడ్డీబేర్లు, పువ్వులు పడి ఉన్నాయి. 
 
37 ఏళ్ల కసాయి తల్లిని అరెస్టు చేసిన పోలీసులు కెయిర్న్స్ బేస్ ఆస్పత్రిలో అనుమతించినట్లు డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ బ్రూనో ఆస్నికర్ తెలిపారు. ప్రస్తుతానికి ఆమె మీద తప్ప వేరెవ్వరి మీదా అనుమానాలు లేవని వారు తెలిపారు.
 
కాగా ఆ మహిళకున్న మరో కొడుకు (20) ఇంటికి వచ్చినప్పుడు పిల్లల మృతదేహాలు, ఆ పక్కనే టెడ్డీ బేర్లు, పూల బొకేలు కనిపించాయి. దీంతో అతను ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఆమెను అరెస్టు చేసినట్లు సమాచారం.

Share this Story:

Follow Webdunia telugu