Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

భారత్‌లో భావ ప్రకటనా స్వేచ్ఛ హరించుకుపోతోంది : ట్రెంట్ ఫ్రాంక్స్

మా దేశంలో భావ ప్రకటనా స్వేచ్ఛ హరించుకుపోతోందని అమెరికా ప్రతినిధుల సభ ప్రతినిధి ట్రెంట్ ఫ్రాంక్స్ ఆవేదన వ్యక్తంచేశారు. బెంగుళూరులో సీనియర్ జర్నలిస్టు గౌరీ లంకేశ్ హత్య, ఆపై హైదరాబాద్ దళిత రచయిత కంచ ఐలయ్

భారత్‌లో భావ ప్రకటనా స్వేచ్ఛ హరించుకుపోతోంది : ట్రెంట్ ఫ్రాంక్స్
, సోమవారం, 16 అక్టోబరు 2017 (09:34 IST)
మా దేశంలో భావ ప్రకటనా స్వేచ్ఛ హరించుకుపోతోందని అమెరికా ప్రతినిధుల సభ ప్రతినిధి ట్రెంట్ ఫ్రాంక్స్ ఆవేదన వ్యక్తంచేశారు. బెంగుళూరులో సీనియర్ జర్నలిస్టు గౌరీ లంకేశ్ హత్య, ఆపై హైదరాబాద్ దళిత రచయిత కంచ ఐలయ్య ఉదంతాలను ప్రస్తావించిన, రిపబ్లికన్ ప్రతినిధి హెరాల్డ్ ట్రెంట్ ఫ్రాంక్స్... ఓ మరణం, మరో హత్య చేస్తామన్న బెదరింపులను భారత్ ఎంతమాత్రమూ పరిగణనలోకి తీసుకోలేదని ఆరోపించారు.
 
మాట్లాడే స్వేచ్ఛ నశిస్తోందని, ఇంటర్నెట్ మాధ్యమంగా తమ అభిప్రాయాన్ని చెప్పిన వారు సైతం శిక్షలకు గురవుతున్నారని ఆరిజోనా 8వ జిల్లాకు ప్రతినిధిగా ఉన్న హెరాల్డ్ ఆరోపించారు. నెల రోజుల క్రితం తన ఇంటిముందే ఓ జర్నలిస్టు దారుణంగా హత్యకు గురైతే, నిందితులను ఇప్పటివరకూ అరెస్ట్ చేయలేదని, ఏ మాత్రం భయంలేకుండా ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిస్తున్న ఘటనలు భారత్‌లో జరుగుతున్నాయని అన్నారు. 
 
ఈ సందర్భంగా గోవింద్ పనేసర్, ఎంఎం కాల్ బుర్గి, నరేంద్ర దబోల్కర్ తదితరుల హత్యలనూ ఆయన ప్రస్తావించారు. భారత్‌లో ఓ కులం సామాజిక పెత్తనం గురించి రాసిన ఐలయ్య అనే ప్రొఫెసర్‌ బీజేపీ మిత్రపక్షంలోని ఓ ఎంపీ బహిరంగంగా ఉరి తీస్తానని హెచ్చరించాడని ఫ్రాంక్స్ గుర్తుచేశారు. ప్రజా ప్రతినిధులే భావ స్వేచ్ఛను అడ్డుకుంటున్నారని, దీన్ని అడ్డుకునేందుకు భారత్‌పై ఎటువంటి ఒత్తిడి పెట్టాలన్న విషయమై చర్చించాల్సిన అవసరం ఉందని యూఎస్ కాంగ్రెస్‌ను ట్రెంట్ ఫ్రాంక్స్ కోరారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

డొనాల్డ్ ట్రంప్ మూడో ప్రపంచ యుద్ధానికి తెరదీశారు: హిల్లరీ క్లింటన్ ఫైర్