Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

2015 రిపబ్లిక్‌ డే వేడుకలకు ఒబామా రాక

2015 రిపబ్లిక్‌ డే వేడుకలకు ఒబామా రాక
, శనివారం, 22 నవంబరు 2014 (14:50 IST)
భారత దేశంలో 2015 జనవరి 26న జరిగే రిపబ్లిక్ డే వేడుకలకు ముఖ్య అతిథిగా అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా హాజరవుతున్నారు. ఈ విషయాన్ని వైట్ హౌస్‌ అధికారులు ధ్రువీకరించారు. 
 
ఇటీవల భారత ప్రధాని నరేంద్రమోడీ అమెరికా పర్యటనకు వెళ్ళిన సందర్భంగా అక్కడ ఆయనకు ఘన స్వాగతం లభించింది. అమెరికా ప్రభుత్వం, అధ్యక్షుడు బరాక్ ఒబామాతో స్నేహం పెరిగింది. తిరిగి వచ్చే సమయంలో మోడీ ఒబామాను భారత రిపబ్లిక్ వేడుకలలో పాల్గొనాల్సిందిగా ఆహ్వానించారు. 
 
అందుకు ఒబామా అంగీకరించినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని వైట్‌హౌస్ కూడా నిర్ధారించింది. ఈ విషయాన్ని నరేంద్ర మోడీ ట్విట్టర్ ద్వారా వెల్లడిస్తూ సంతోషం వ్యక్తం చేశారు. 
 
కాగా ఇటీవల నరేంద్రమోడీ ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్ళినప్పుడు, జీ-20 దేశాల సదస్సుకు హాజరైన సందర్భాల్లో ఒబానాతో భేటీ అయిన విషయం తెలిసింది.
 
ఇదిలా అనుమతి అమెరికాలో ఉంటున్న భారతీయులతో పాటు ఇతర దేశాలకు చెందిన వారు వెంటనే ఖాళీ చేయాలని ఉత్తర్వులు ఈ నేపథ్యంలో వారు తాత్కాలికంగా అక్కడే ఉండటానికి వీలుగా చట్టబద్ధత కల్పించారు. తద్వారా ఇప్పటికిప్పుడు అమెరికాను విడిచిపెట్టి వెళ్లాల్సిన సంకట పరిస్థితి ఎదురు కాకుండా చూశారు.

Share this Story:

Follow Webdunia telugu