Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఉప్పుతో కూడా చంపేయవచ్చు... అమెరికాలో ఓ కసాయి తల్లి ఘాతుకం

ఉప్పుతో కూడా చంపేయవచ్చు... అమెరికాలో ఓ కసాయి తల్లి ఘాతుకం
, మంగళవారం, 27 జనవరి 2015 (16:36 IST)
ఉప్పు.. పప్పులో కలుపుకుంటే మయ టేస్టు. అయితే దీనితోనే హత్యలు కూడా చేయవచ్చు.. ఏం మాట్లాడుతున్నారు..? ఉప్పుతో హత్యలు చేయడం ఏంటి? ఆడవాళ్లకి ఉప్పుతో పప్పు చేసేదే తెలుసు కానీ, హత్య చేయడం కూడా తెలుసా.. ! హాస్యానికి ఓ హద్దు ఉండాలని అనుకుంటున్నారా... ! నిజమండీ బాబూ... ఓ కసాయి తల్లి అదే చేసింది. తన ఐదేళ్ల కొడుక్కి ఉప్పిచ్చి మరీ చంపింది. ఆ వివరాలేంటో తెలుసుకుందాం రండీ. 
 
న్యూయార్క్ నగరంలో లేసీ స్పియర్స్  అనే ఓ లేడీ తన ఐదేళ్ల కొడుకును వదిలించుకోవాలని అనుకుంది. అయితే ఒకేసారి విషమిచ్చి చంపినా, కొట్టి చంపినా కేసు తనపైకి వస్తుందని భయ పడింది. మరి చంపడం ఎలా..? అని చాలా కిరాతకంగా ఆలోచించింది. చివరకు వంటింట్లోని ఉప్పును ప్రయోగించింది. స్లోపాయిజన్‌లా తన పిల్లాడి ఆహారంలో ఉప్పును ఎక్కువగా కలుపుతూ వచ్చింది. తినేందుకు ఉప్పుప్పగా ఉండడంతో పిల్లాడు కూడా లొట్టలేసుకుని తింటూ వచ్చాడు. ఇలా తీసుకోవడం వలన అతని శరీరంలో లవణ శాతం ఎక్కువైంది.  రాను రాను పిల్లాడి మెదడు ఉబ్బిపోయింది. 
 
రోజురోజుకు ఆరోగ్యం క్షీణిస్తూ వచ్చింది ఏమి తెలియని దానిలా తన కుమారుడుని హాస్పిటల్‌లో చేర్చింది. ఆపై త్వరగా కోలుకునేలా అందరూ ప్రార్థించాలంటూ ట్వీట్ చేస్తూ వచ్చింది. బాలుడు క్షీణిస్తున్న ఫోటోలను కూడా పోస్ట్ చేసింది. చివరకు చిన్నారి మరిణించాడు. కానీ పోస్టుమార్టం చేయగా అతని శరీరంలో సోడియంపాళ్లు ఎక్కువగా ఉన్నట్టు గుర్తించారు. ఇందుకు కన్న తల్లి ఇచ్చిన ఉప్పే కారణమని తేలింది. దీంతో కసాయి తల్లి బండారం బట్టబయలైంది. ఈమెపై హత్య కేసు నమోదయ్యింది. 

Share this Story:

Follow Webdunia telugu