Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కుక్క తోక వంకర.. మళ్లీ భారత్‌ భూభాగంలోకి చైనా బలగాలు!

కుక్క తోక వంకర.. మళ్లీ భారత్‌ భూభాగంలోకి చైనా బలగాలు!
, శనివారం, 20 సెప్టెంబరు 2014 (14:20 IST)
కుక్క తోక వంకర అన్నట్లు.. భారత్ భూభాగంలోకి చైనా బలగాలు మరోసారి ప్రవేశించాయి. లడఖ్‌లోని చుముర్ ప్రాంతంలోకి చైనా సైనిక బలగాలు శనివారం ఉదయం మరోసారి చొచ్చుకువచ్చాయి. దీంతో, సరిహద్దు వద్ద మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 
 
గురువారం ఉదయం... మరి కొన్నిగంటల్లో చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ భారత్‌లో కాలమోపనున్నారని భారత ప్రభుత్వ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తుండగా, లడఖ్‌లోని చుముర్ ప్రాంతంలోకి చైనా సైనికులు చొచ్చుకువచ్చారు. 
 
అయితే, ప్రధానమంత్రి నరేంద్రమోడీ సరిహద్దు వివాదాన్ని జిన్ పింగ్ దగ్గర గట్టిగా ప్రస్తావించడంతో... చైనా ప్రభుత్వంలో కదలిక వచ్చి శుక్రవారం తన దళాలను భారత భూభాగం నుంచి ఉపసంహరించుకుంది. కానీ 24 గంటలు కూడా పూర్తికాకముందే... 'కుక్కతోక వంకర' లాగా చైనా బలగాలు మళ్లీ భారత భూభాగం లోకి ప్రవేశించాయి.

Share this Story:

Follow Webdunia telugu