Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

భారత్‌లో అల్లకల్లోలం సృష్టించండి : సరిహద్దుల్లో ఉగ్రమూకలకు సయీద్ పిలుపు

భారత్‌లో అల్లకల్లోలం సృష్టించండి : సరిహద్దుల్లో ఉగ్రమూకలకు సయీద్ పిలుపు
, శుక్రవారం, 27 నవంబరు 2015 (13:01 IST)
భారత్‌లో అల్లకల్లోలం సృష్టించాలంటూ సరిహద్దుల్లో ఉగ్రమూకలకు అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ జమాత్ ఉద్ దవా చీఫ్, ముంబై దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్ పిలుపునిచ్చారు. 
 
ప్రస్తుతం ఈ కరుడుగట్టిన తీవ్రవాది ఇండో - పాక్ సరిహద్దుల్లో యధేచ్చగా తిరుగుతున్నాడు. ముఖ్యంగా పాక్ ఆక్రమిక కాశ్మీర్‌లో ఉన్న సరిహద్దుల్లోని పాక్ ప్రేరేపిత ఉగ్ర స్థావరాలను సందర్శిస్తూ అక్కడ శిక్షణ పొందుతున్న వారికి భారత్‌పై ప్రతీకార పాఠాలను నూరిపోస్తున్నాడు. 'భారత్‌లో విరివిగా దాడులకు పాల్పడండి' అంటూ తాజాగా పిలుపునిచ్చాడు. ఈ తరహా ప్రసంగం పాక్ భద్రతా దళాల దన్నుతోనే చేస్తుండటం గమనార్హం. 
 
అందువల్లే ఇటీవల భారత సైనిక స్థావరాలపై పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు విరుచుకుపడుతున్నారని బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) ఆరోపిస్తోంది. పాకిస్థాన్‌లోని సియాల్ కోట్ సమీపంలోని సరిహద్దు వద్ద అతడు ఉగ్రవాదులను ఉద్దేశించి ప్రసంగించినట్లు తమ వద్ద పక్కా ఆధారాలున్నాయని బీఎస్ఎఫ్ జమ్మూ ఐజీ రాకేశ్ శర్మ్ మీడియాకు వెల్లడించారు. 

Share this Story:

Follow Webdunia telugu