Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

స్వైన్‌ఫ్లూ బారినపడ్డ కొలంబియా అధ్యక్షుడు

స్వైన్‌ఫ్లూ బారినపడ్డ కొలంబియా అధ్యక్షుడు
కొలంబియా అధ్యక్షుడు అల్వరో యూరీబ్‌ స్వైన్‌ఫ్లూ మహమ్మారి బారిన పడ్డారు. ప్రస్తుతం ఆయనకు అధికారిక వైద్యులు చికిత్సనందిస్తున్నారని కొలంబియా సామాజిక రక్షణ శాఖామంత్రి డియేగో పైలేసియో తెలిపారు.

తమ దేశ అధ్యక్షుడు స్వైన్‌ఫ్లూ బారిన పడినప్పటికీ, ఆ వ్యాధి అంత తీవ్రంగా లేదని మంత్రి తెలిపారు. ఆయన శుక్రవారం ఈ వ్యాధిబారిన పడ్డారని మంత్రి వెల్లడించారు. తమ దేశ అధ్యక్షుడు త్వరగా కోలుకుంటారని ఈ సందర్భంగా ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

గత శుక్రవారంనాడు అర్జెంటీనాలో జరిగిన దక్షిణ అమెరికా నేతల సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. శనివారానికి ఆయన ఈ మహమ్మారి వ్యాధిబారిన పడ్డారని మంత్రి పేర్కొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu