Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

స్వదేశానికి చేరుకోనున్న 25 వేల మంది వైద్యులు!

స్వదేశానికి చేరుకోనున్న 25 వేల మంది వైద్యులు!
, సోమవారం, 4 జనవరి 2010 (17:18 IST)
బ్రిటన్‌లో పని చేస్తున్న 25 వేల మంది భారతీయ వైద్యులు స్వదేశానికి చేరుకోనున్నారు. వీరంతా వచ్చే రెండేళ్లలో స్వదేశానికి వచ్చి తమ వృత్తిని కొనసాగేందుకు సమ్మతించినట్టు తెలుస్తోంది. దీనిపై ఇంగ్లండ్‌లో పని చేస్తున్న భారతీయ వైద్యుల సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ.. ఇంగ్లండ్‌లోని అనేక ప్రాంతాల్లో సుమారు 15 వేల మంది వైద్యులు పని చేస్తున్నారు. వీరంతా త్వరలోనే భారత్‌కు చేరుకుంటారన్నారు.

అలాగే, ఇప్పటికే పదవీ విరమణ పొందిన మరో పదివేల మంది వైద్యులు కూడా స్వదేశానికి వెళ్లేందుకు సంసిద్ధత వ్యక్తం చేసినట్టు ఆయన తెలిపారు. ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వంతో వైద్యులు చర్చలు జరుపగా, సానుకూల స్పందన వచ్చినట్టు ఆయన తెలిపారు. స్వదేశానికి వెళ్లే తమకు అన్ని సౌకర్యాలను కేంద్ర ప్రభుత్వం సమకూర్చుతుందనే ఆశాభావాన్ని ఆ సంఘ ప్రతినిధులు తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu