లండన్లో భారతీయ విద్యార్థులపై లండన్ వాసులు దాడులకు పాల్పడ్డారు. లండన్లోని సిటీ విశ్వవిద్యాలయంలో చదువుతున్న ఆరుగురు విద్యార్థులపై ఆ దేశానికి చెందిన దుండుగులు దాడులకు పాల్పడ్డారు.
విశ్వవిద్యాలయంలో ప్రస్తుతం ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీంతో ఆ ప్రాంతంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా భారీ సంఖ్యలో పోలీసు బలగాలు మొహరించాయి.
భారతీయ విద్యార్థులపై దాడులకు పాల్పడ్డ వారిని గుర్తించి అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
తమపై జరిగిన దాడులు కేవలం ఉద్దేశ్యపూర్వకంగానే జరిగాయని, తమపై దాడులు చేసినవారు జాతివివక్షతోనే దాడులకు పాల్పడ్డామని తమతో అన్నట్లు గాయాలపాలైన భారతీయ విద్యార్థులు తెలిపారు.
ఈ దాడుల్లో తమతోపాటు దక్షిణాసియా దేశాలకు చెందిన పలువురు విద్యార్థులు కూడా తీవ్రంగా గాయపడ్డారని వారు పేర్కొన్నారు.
ఆస్ట్రేలియాలో మాదిరిగానే పాశ్చాత్య దేశాలలోను భారతీయ విద్యార్థులపై దాడులు పెరుగుతుండటంతో దేశంలోని పలువురు తల్లిదండ్లులు ఆందోళన చెందుతున్నారు.