Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముషారఫ్ ప్రభుత్వంలో అల్‌ఖైదా సానుభూతిపరులు: షెనీ

Webdunia
మంగళవారం, 30 ఆగస్టు 2011 (16:18 IST)
పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ ప్రభుత్వంలో అల్ ఖైదా సానుభూతిపరులు కీలక స్థానాలను పొందారని, ఆ తీవ్రవాద సంస్థ ఎంతటి ప్రాధాన్యత పొందినదనటానికి ఒసామా బిన్ లాడెన్ అబోట్టాబాద్‌లో ఉండటమే ఉదాహరణని అమెరికా మాజీ ఉపాధ్యక్షుడు డిక్ షెనీ రాసుకున్న తన జ్ఞాపకాల్లో వెల్లడించారు.

2001 సెప్టెంబర్‌ 11న అమెరికాపై అల్‌ఖైదా దాడి తర్వాత అమెరికా, పాకిస్థాన్ సంబంధాల్లో అనేక ఒడిదుడుకులు ఎదురైనట్లు 2001 నుంచి 2009 వరకు జార్జిబుష్ కొలువులో ఉపాధ్యక్షుడిగా పనిచేసిన షెనీ పేర్కొన్నారు. 2004 తర్వాతనే పరిస్థితుల్లో కొంతమార్పు వచ్చిందన్నారు. అయితే ముషారఫ్ ప్రభుత్వంలోని అల్ ఖైదా సానుభూతిపరుల పేర్లను మాత్రం ఆయన వెల్లడించలేదు. తన పాలనలో సాధించిన కీలక విదేశీ విధానంగా జార్జి బుష్ భావించే భారత్-అమెరికా సంబంధాల గురించి మాత్రం షెనీ తన 533 పేజీల పుస్తకంలో ప్రస్తావించలేదు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dhanush: ధనుష్ మిస్టర్ కార్తీక్ రీ రిలీజ్ కు సిద్ధమైంది

రాజు గాని సవాల్ రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నాం : డింపుల్ హయతి, రాశీ సింగ్

AM Ratnam: హరి హర అంటే విష్ణువు, శివుడు కలయిక - ఇది కల్పితం, జీవితకథ కాదు : నిర్మాత ఎ.ఎం. రత్నం

పెద్ద నిర్మాతను ఏడిపించిన సీనియర్ జర్నలిస్టు - ఛాంబర్ చర్య తీసుకుంటుందా?

టాలీవుడ్‌లో విషాదం - నటుడు ఫిష్ వెంకట్ ఇకలేరు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

Show comments