Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముషారఫ్‌పై ఎఫ్ఐఆర్ నమోదుకు పాక్ కోర్టు ఆదేశం

Webdunia
గురువారం, 8 అక్టోబరు 2009 (09:25 IST)
పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిందిగా బలూచిస్థాన్ హైకోర్టు బుధవారం ఆదేశాలు జారీ చేసింది. బలూచీ జాతీయ నేత నవాజ్ అక్బర్ బుగ్తీ హత్య కేసులో ముషారఫ్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసు విచారణ నిమిత్తం ముషారఫ్ కోర్టుకు హాజరుకావాలని గతంలో హైకోర్టు ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. మాజీ అధినేత మాత్రం హైకోర్టు ఆదేశాలను ధిక్కరించారు.

పైపెచ్చు విచారణ సమయంలో ముషారఫ్ తరపు న్యాయవాదులు సైతం గైర్హాజరయ్యారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ధర్మాసనం ముషారఫ్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిందిగా ఉత్తర్వులు జారీ చేసింది. మాజీ అధ్యక్షుడిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి, బుగ్తీ హత్య కేసులో ఆయన పాత్రపై విచారణ చేపట్టాలని డేరాబుగ్తీ జిల్లా పోలీసులకు హైకోర్టు ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏఎం రత్నంపై ఫిర్యాదులు - 'హరిహర వీరమల్లు' రిలీజ్‌కు చిక్కులా?

దళితుడిని అని తెలిశాకే.. సినిమా అవకాశాలు తగ్గిపోయాయి.: బాబు మోహన్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

Show comments